21వ శతాబ్దపు బెస్ట్ క్రికెటర్గా ఆడమ్ గిల్క్రిస్ట్... రెండో స్థానంలో విరాట్ కోహ్లీ... సచిన్కి...
First Published Jan 3, 2021, 4:10 PM ISTప్రపంచక్రికెట్లో భారత సారథి, ‘రన్ మెషిన్’, ‘కింగ్’ విరాట్ కోహ్లీ డామినేషన్ కొనసాగుతూనే ఉంది. ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో రెండు అవార్డులు సొంతం చేసుకున్న విరాట్, తాజాగా ఈ శతాబ్దంపు ఉత్తమ క్రికెటర్గా రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్... ఈ శతాబ్దపు ఉత్తమ క్రికెటర్గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన ది డైలీ టెలిగ్రాఫ్ విడుదల చేసిన 21వ శతాబ్దపు టాప్ 50 ప్లేయర్లలో గిల్లీకి టాప్ ప్లేస్ దక్కగా భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీకి రెండో స్థానం దక్కింది. టీమిండియా నుంచి విరాట్ కోహ్లీతో పాటు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, మహేంద్ర సింగ్ ధోనీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ టాప్ 50లో చోటు దక్కించుకున్నారు. రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ వంటివారికి ఈ జాబితాలో చోటు దక్కలేదు...