శర్మగారి అబ్బాయి ‘బీఫ్’ తిన్నాడా? న్యూఇయర్ పార్టీ ‘బిల్లు’తో రోహిత్ శర్మకు కొత్త చిక్కులు...
First Published Jan 3, 2021, 11:56 AM ISTరోహిత్ శర్మ, మరో నలుగురు యువ క్రికెటర్లతో చేసిన న్యూ ఇయర్ విందు మనోడికి కొత్త కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. న్యూఇయర్ పార్టీ సందర్భంగా రోహిత్ శర్మ, పృథ్వీషా, శుబ్మన్ గిల్, రిషబ్ పంత్, నవ్దీప్ సైనీ కలిసి ఓ రెస్టారెంట్కి వెళ్లి డిన్నర్ చేశారు. అదే రెస్టారెంట్లో భారత క్రికెటర్లను చూసి, ఓ టీమిండియా అభిమాని... అభిమానంతో వారి హోటల్ బిల్లు చెల్లించాడు. బిల్లు కట్టినోడు, కట్టినట్టు ఉండక... సోషల్ మీడియాలో బిల్లుతో సహా పోస్టు చేశాడు. ఇది టీమిండియాకు కొత్త కొత్త సమస్యలు తెస్తూనే ఉంది.