శర్మగారి అబ్బాయి ‘బీఫ్’ తిన్నాడా? న్యూఇయర్ పార్టీ ‘బిల్లు’తో రోహిత్ శర్మకు కొత్త చిక్కులు...

First Published Jan 3, 2021, 11:56 AM IST

రోహిత్ శర్మ, మరో నలుగురు యువ క్రికెటర్లతో చేసిన న్యూ ఇయర్ విందు మనోడికి కొత్త కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. న్యూఇయర్ పార్టీ సందర్భంగా రోహిత్ శర్మ, పృథ్వీషా, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, నవ్‌దీప్ సైనీ కలిసి ఓ రెస్టారెంట్‌కి వెళ్లి డిన్నర్ చేశారు. అదే రెస్టారెంట్‌లో భారత క్రికెటర్లను చూసి, ఓ టీమిండియా అభిమాని... అభిమానంతో వారి హోటల్ బిల్లు చెల్లించాడు. బిల్లు కట్టినోడు, కట్టినట్టు ఉండక... సోషల్ మీడియాలో బిల్లుతో సహా పోస్టు చేశాడు. ఇది టీమిండియాకు కొత్త కొత్త సమస్యలు తెస్తూనే ఉంది.

సదరు అభిమాని తాను బిల్లు కట్టిన ఫోటోతో పాటు భారత క్రికెెటర్లు రెస్టారెంట్‌లో కలిసి తింటున్న ఫోటో, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తీవ్ర దుమారం రేగింది...
undefined
భారత క్రికెటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించారంటూ క్రికెట్ ఆస్ట్రేలియా దర్యాప్తుకి ఆదేశించగా... బీసీసీఐ కూడా ఏ దర్యాప్తుకైనా సిద్ధమని చెప్పింది.
undefined
ఇప్పటికీ ఈ ఐదురుగు క్రికెటర్లు ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో గడుపుతున్నారు. ఇప్పుడు ఈ విందు మరో కొత్త చిక్కు తీసుకొచ్చింది.
undefined
భారత క్రికెటర్ల కోసం బిల్లు చెల్లించానంటూ ఓ అభిమాని, రెస్టారెంట్ బిల్లు రశీదును సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
undefined
వివాదం మొత్తం రేగడానికి కారణమైన ఈ బిల్లు... ఇప్పుడు రోహిత్ శర్మపై నెటిజన్ల ట్రోలింగ్‌కి కారణమైంది.
undefined
సదరు అభిమాని పోస్టు చేసిన ఫోటోలో చికెన్, పోర్క్, రొయ్యలతో పాటు బీఫ్ కూడా ఆర్డర్ చేసినట్టు స్పష్టంగా కనిపించింది.
undefined
దీంతో ‘శర్మగారి అబ్బాయి బీఫ్ తిన్నాడంటూ’ నెటిజన్లు రోహిత్ శర్మను టార్గెట్ చేస్తే బీభత్సమైన ట్రోలింగ్ చేస్తున్నారు.
undefined
ముంబై ఇండియన్స్‌కి ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన ‘వడా పావ్ కింగ్’ బీఫ్ తింటున్నాడంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
undefined
అయితే రోహిత్ శర్మ పూర్తి వెజిటేరియన్ అని, కోడి గుడ్లు తప్ప మాంసాహారం తినడని వాదిస్తున్నారు రోహిత్ శర్మ అభిమానులు
undefined
అయితే సదరు అభిమాని పోస్టు చేసిన ఫోటోలో డైట్ కోక్స్ మినహా ఒక్క వెజిటేరియన్ ఐటెమ్ కూడా లేకపోవడం విశేషం.
undefined
click me!