బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో సెంచరీ బాది... మూడేళ్ల బ్రేక్ తర్వాత వన్డేల్లో కూడా సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ, మూడు మ్యాచుల్లో రెండు శతకాలు కొట్టేశాడు. అయితే టెస్టుల్లో మాత్రం విరాట్ బ్యాటు నుంచి ఇంకా సెంచరీ రాలేదు. నాగ్పూర్ టెస్టులో 12 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, ఢిల్లీ టెస్టులోనూ సెంచరీ మార్కును చేరుకోలేకపోయాడు.