విరాట్ కోహ్లీకి ఇది 522వ ఇన్నింగ్స్ కాగా ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 523 ఇన్నింగ్స్ల్లో, రికీ పాంటింగ్ 652వ ఇన్నింగ్స్ల్లో 71వ సెంచరీని అందుకున్నారు. అలాగే టీ20ల్లో టీమిండియా తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన విరాట్ కోహ్లీ, ఆసియా కప్లో టీ20 ఫార్మాట్లో, వన్డే ఫార్మాట్ (183) లో అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు.