ఇదిలా ఉంటే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో క్రిస్ గేల్(14562) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అలెక్స్ హేల్స్ (13610), షోయబ్ మాలిక్ (13557), కీరన్ పోలార్డ్(13537), విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు. ముంబైతో జరుగుతోన్న మ్యాచ్లో కోహ్లి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 42 బంతుల్లో 67 పరుగులు చేసిన కోహ్లీ హార్ధిక్ పాండ్యా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి నమన్ ధీర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.