రన్ మెషిన్‌కి రిపేరు పడిందా... దారుణంగా విఫలమవుతున్న విరాట్ కోహ్లీ... గత 22 ఇన్నింగ్స్‌ల్లో...

First Published Nov 28, 2020, 1:11 PM IST

విరాట్ కోహ్లీ... క్రికెట్ ప్రపంచంలో ఓ సంచలనం. టన్నుల కొద్దీ పరుగులు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచిన విరాట్ కోహ్లీ... కొంత కాలంగా బాగా ఇబ్బంది పడుతున్నాడు. వన్డేలు, టెస్టులు, టీ20లు అనే సంబంధం లేకుండా అన్ని ఫార్మాట్లలో చెలరేగే విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి సెంచరీ వచ్చి చాలా కాలమైంది. తాజాగా ఆస్ట్రేలియా జరిగిన మొదటి వన్డేలోనూ ఈ ఛేజింగ్ కింగ్ దారుణంగా విఫలమయ్యాడు.

మొదటి వన్డేలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన విరాట్ కోహ్లీ... 21 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
undefined
వన్డేల్లో సెకండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సెంచరీలు చేసి ‘ఛేజింగ్ కింగ్’గా కీర్తించబడిన విరాట్ కోహ్లీ నిర్లక్ష్యంగా షాట్స్ ఆడుతూ అవుట్ అవ్వడం ఫ్యాన్స్‌కి ఆశ్చర్యానికి గురి చేసింది.
undefined
సచిన్ టెండూల్కర్‌లాగే నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించడం విరాట్ కోహ్లీ స్టైల్... బౌలర్లకు తేలిగ్గా వికెట్ ఇవ్వడానికి విరాట్ కోహ్లీ ఏ మాత్రం ఇష్టపడడు.
undefined
సచిన్ టెండూల్కర్ ఫామ్ కోల్పోయి చాలా ఏళ్ల పాటు ఇబ్బందిపడ్డాడు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం అసాధారణ బ్యాట్స్‌మెన్‌గా కనిపించాడు. ఒకటి రెండు మ్యాచుల్లో విఫలమైన సందర్భాలు ఉన్నాయి కానీ నెలల పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన రోజులు మాత్రం లేవు.
undefined
అసాధారణంగా పరుగుల వర్షం కురిపించిన విరాట్ కోహ్లీ ‘రన్ మెషిన్’గా, ‘పరుగుల యంత్రం’గా గుర్తింపు దక్కించుకున్నాడు. కానీ గత ఏడాది నుంచి విరాట్ బ్యాటింగ్ తీరు మారింది...
undefined
ఐపీఎల్‌లో ఒకటి రెండు మ్యాచుల్లో ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించినా... మళ్లీ విరాట్ తడబాటు కొనసాగుతూనే ఉంది. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు క్రేజ్ పెరగడం, కోహ్లీపై ట్రోలింగ్ పెరగడానికి బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన కూడా ఓ కారణం.
undefined
గత 22 ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా అందుకోలేకపోయాడు విరాట్ కోహ్లీ... మూడు ఫార్మాట్లలోనూ విరాట్ కోహ్లీ నుంచి సెంచరీ వచ్చి ఏడాది దాటింది..
undefined
గత ఏడాది నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన జరిగిన డే నైట్ మ్యాచ్‌లో చివరిసారిగా సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ... ఆ తర్వాత వన్డే, టీ20, టెస్టు మ్యాచులతో కలిపి 22 ఇన్నింగ్స్‌లు ఆడినా ఒక్క సెంచరీ కూడా రాలేదు...
undefined
వన్డే మ్యాచుల్లో విరాట్ కోహ్లీ సెంచరీ బాది, ఏడాదిన్నర దాటిపోయింది. 2019 ఆగస్టులో వన్డేల్లో చివరి వన్డే బాదిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత విండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీసుల్లో సెంచరీ చేయలేకపోయాడు.
undefined
అదీ కాకుండా గత 22 ఇన్నింగ్స్‌లో ఆరు హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ.. చివరి 11 ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించాడంటే రన్ మెషిన్ ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.
undefined
గత దశాబ్ద కాలంలో 20 వేలకు పైగా పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన విరాట్ కోహ్లీ... కొంత కాలంగా ఒత్తిడికి గురి అవుతున్నట్టు స్పష్టంగా అర్థం అవుతోంది...
undefined
దీనికి అతని వ్యక్తిగత జీవితం కూడా ఓ కారణం కావచ్చు. కరోనా టైమ్‌లో భార్య అనుష్క శర్మ గర్భంతో ఒంటరిగా ఉండడం వంటివి కూడా విరాట్ ఆటతీరుపై ప్రభావం చూపుతుండొచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
undefined
375 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా చేధించాలంటే, ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ 130+ స్కోరు చేయాలని చెప్పాడు వీరేంద్ర సెహ్వాగ్. అయితే విరాట్ కోహ్లీ 21 పరుగులకే అవుట్ అయ్యాడు. పాండ్యా, శిఖర్ ధావన్ పోరాటంతో మొదటి వన్డేలో పోరాడి ఓడింది టీమిండియా.
undefined
click me!