సిక్సర్లు కొట్టేటప్పుడు రాహుల్‌కి సారీ చెప్పా... జేమ్స్ నీషమ్, మ్యాక్స్‌వెల్ మధ్య సరదా సంభాషణ...

First Published Nov 28, 2020, 12:13 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో అత్యంత పేలవమైన ప్రదర్శన ఇచ్చాడు కింగ్స్ ఎలెవన్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. వన్డేల్లో సెంచరీ తర్వాత ఐపీఎల్ ఆడిన మ్యాక్స్‌వెల్‌పై భారీ అంచనాలు పెట్టుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, వరుసగా ఫెయిల్ అవుతున్నా అతనికి అనేక అవకాశాలు ఇచ్చింది. అయితే మ్యాక్స్‌వెల్ బ్యాటు నుంచి ఒక్క భారీ ఇన్నింగ్స్ కాదు, ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా రాలేదు.

ఐపీఎల్ తర్వాత టీమిండియాతో ఆడుతున్న ఆసీస్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్... భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ బౌండరీల మోత మోగించాడు.
undefined
ఐపీఎల్‌లో ఆడిన 14 మ్యాచుల్లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయిన మ్యాక్స్‌వెల్... 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేసి అదరగొట్టాడు...
undefined
మొదటి వన్డేలో మ్యాక్స్‌వెల్ స్టైయిక్ రేటు 230కి పైనే... ఐపీఎల్‌లో ఏ మ్యాచ్‌లోనూ 150కి పైగా స్ట్రైయిక్ రేటుతో బ్యాటింగ్ చేయలేకపోయిన మ్యాక్స్‌వెల్ ఈ రకంగా చెలరేగిపోవడం ఓ రకంగా పంజాబ్‌ జట్టుకి షాకింగ్ విషయమే.
undefined
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకి చెందిన మరో ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ కూడా వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు.
undefined
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్... మ్యాక్స్‌వెల్, జేమ్స్ నీషమ్ బ్యాటింగ్ చూశాక షాక్ అయ్యి ఉంటానంటూ ఓ మీమీని పోస్టు చేశాడు.
undefined
దీనిపై స్పందించిన జేమ్స్ నీషమ్.. ‘హాహాహా... ఇది చాలా బాగుంది...’ అంటూ మ్యాక్స్‌వెల్‌ను ట్యాగ్ చేశాడు... నీషమ్ కామెంట్‌కి రిప్లై ఇచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్... ‘నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రాహుల్‌కి సారీ చెప్పాను’ అంటూ కింగ్స్ ఎలెవన్ ఫ్రెండ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించాడు.
undefined
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున 5 మ్యాచులు ఆడిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్... కేవలం 19 పరుగులు మాత్రమే చేసి, 2 వికెట్లు పడగొట్టాడు.
undefined
వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేసిన నీషమ్...న్యూజిలాండ్‌కి విజయాన్ని అందించాడు...
undefined
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన 11 మ్యాచుల్లో 345 పరుగులు చేసిన బెయిర్‌స్టో... సౌతాఫ్రికాతో జరిగిన మొదట టీ20 మ్యాచ్‌లో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు...
undefined
48 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 86 పరుగులు చేసిన జానీ బెయిర్‌స్టో, ఇంగ్లాండ్‌కి ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు...
undefined
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున 12 మ్యాచుల్లో 268 పరుగులు మాత్రమే చేసిన ఆరోన్ ఫించ్... మొదటి వన్డేలో సెంచరీ చేలరేగిన సంగతి తెలిసిందే...
undefined
మరోవైపు ఐపీఎల్2020 సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్... 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగి ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయడానికి కారణమయ్యాడు.
undefined
click me!