Virat Kohli: దంచికొట్టిన విరాట్ కోహ్లీ.. 5 రికార్డులు బద్దలు

Published : May 03, 2025, 10:16 PM IST

Virat Kohli breaks 5 records: ఐపీఎల్ 2025 అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నాడు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ.  చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 62 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పాటు అనేక రికార్డులను సాధించాడు. కింగ్ కోహ్లీ సాధించిన 5 రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

PREV
17
Virat Kohli: దంచికొట్టిన విరాట్ కోహ్లీ.. 5 రికార్డులు బద్దలు

ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ పరుగుల వరదపారిస్తున్నాడు. ఒక్కదాని తర్వాత ఒక్కటి అనేక రికార్డులను సృష్టిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ఇదే జరిగింది. విరాట్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్ రేట్ 187.88గా ఉంది. దీంతో అతని నెమ్మదిగా బ్యాటింగ్‌పై ప్రశ్నలు లేవనెత్తిన విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి.

27
సీఎస్కే పై విరాట్ కోహ్లీ రికార్డులు

చెన్నై సూపర్ కింగ్స్‌పై అర్ధ సెంచరీతో విరాట్ కోహ్లీ అనేక రికార్డులు సృష్టించాడు. అతను మైదానంలోకి అడుగుపెట్టడమే ఒక రికార్డ్. కానీ, ఈసారి అతను సృష్టించిన రికార్డు చాలా ప్రత్యేకమైనది. ఈ మ్యాచ్‌లో కింగ్ సృష్టించిన 5 రికార్డులు ఏంటో తెలుసుకుందాం.

37
1. ఐపీఎల్ లో 8500 పరుగులు

విరాట్ కోహ్లీ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 8500 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్ అయ్యాడు. ఈ మైలురాయికి చేరుకోవడానికి విరాట్‌కు 53 పరుగులు అవసరం కాగా, చెన్నై సూపర్ కింగ్స్‌పై పూర్తి చేసి కొత్త రికార్డు సృష్టించాడు.  ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 62 పరుగుల ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. 

47
2. టీ20 క్రికెట్.. భారత్ లో 9500 పరుగులు

విరాట్ కోహ్లీకి భారతదేశంలో 9500 పరుగులు చేయడానికి కేవలం 10 పరుగులు అవసరం. వీటిని చెన్నై సూపర్ కింగ్స్ పై ఆడిన హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ తో పూర్తి చేశాడు. ఇప్పుడు కింగ్ కోహ్లీ భారత్ లో 9500 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ అయ్యాడు.

57
3. ఆర్సీబీకి 300 సిక్సర్లు బాదిన కింగ్ కోహ్లీ

రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 300 సిక్సర్లు పూర్తి చేశాడు. ఈ మైలురాయికి చేరుకోవడానికి విరాట్‌కు 5 సిక్సర్లు అవసరం. ఈ మ్యాచ్ లో 5 సిక్సర్లు బాది ట్రిపుల్ సెంచరీ సిక్సర్ల రికార్డు సాధించాడు. 

67
4. డేవిడ్ వార్నర్ ను దాటేసిన కోహ్లీ

ఐపీఎల్‌లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన రికార్డును కూడా విరాట్ కోహ్లీ సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఈ మైలురాయికి చేరుకోవడానికి అతనికి 10 పరుగులు అవసరం, కానీ విరాట్ 62 పరుగులు చేశాడు. ఇంతకు ముందు ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ KKRపై 1093 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పుడు వార్నర్ ను దాటేశాడు.

77
5. ఐపీఎల్ హాఫ్ సెంచరీ రికార్డులు సమం

ఐపీఎల్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ ఇప్పుడు డేవిడ్ వార్నర్‌తో సమానంగా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌కు ముందు విరాట్ ఖాతాలో 66 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వార్నర్ మొత్తం 67 సాధించాడు. ఇప్పుడు కోహ్లీ CSKపై అర్ధ సెంచరీతో వార్నర్‌ రికార్డును సమం చేశాడు.

Read more Photos on
click me!

Recommended Stories