కాగా 2008 లో ఈ ఇద్దరూ అండర్ - 19 ప్రపంచకప్ ఆడారు. అప్పుడు కోహ్లీ ఇండియా కెప్టెన్ కాగా షెహ్జాద్ పాకిస్తాన్ సారథిగా ఉన్నాడు. 2009 లో 17 ఏండ్లకే పాకిస్తాన్ జట్టులోకి వచ్చిన అహ్మద్.. టాపార్డర్ లో బ్యాటింగ్ కు వచ్చేవాడు. పాకిస్తాన్ తరఫున అతడు 13 టెస్టులు, 81 వన్డేలు, 59 టీ20లు ఆడాడు. 2016లో టీ20 వరల్డ్ కప్ అనంతరం అతడిపై వేటు పడింది. చివరిసారి 2019 లో పాక్ తరఫున టీ20 ఆడిన షెహజాద్ ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.