వొడువని ముచ్చట.. పంత్‌‌కు రాఖీ విషెస్ చెప్పి అతడి కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ హాట్ బ్యూటీ

First Published Aug 12, 2022, 11:37 AM IST

Rishabh Pant-Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా, టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ల మధ్య మొదలైన ఇన్‌స్టాగ్రామ్ వార్ కొనసాగుతూనే ఉంది. ఈ మాజీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇన్స్టాగ్రామ్ స్టోరీకి  ఊర్వశి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తాను  నోరు మూసుకుని ఉన్నానని, దానిని అలుసుగా తీసుకోవద్దని  స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.  అంతేగాక రిషభ్ పంత్ కు రాఖీ పండుగ శుభాకాంక్షలు కూడా చెప్పింది. తాను ఎవరిని బద్నాం చేయలేదని, అంత ఖర్మ తనకేం పట్టలేదని పేర్కొంది. చూస్తుంటే వీళ్లిద్దరి మధ్య సోషల్ మీడియా వార్ ఇప్పట్లో ముగిసేలా లేదు. 

ఇటీవల ఊర్వశి.. ఓ ఇంటర్వ్యూలో తనకు రిషభ్ పంత్ కు ఎలా బ్రేకప్ అయిన విషయాన్ని బయటపెట్టింది. పంత్ పేరు ఎత్తకుండా అతడిని ఆర్‌పీ అని సంబోధిస్తూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 
 

ఆమె స్పందిస్తూ.. ‘వారణాసిలో నేను ఓ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నా.. అక్కడి నుంచి న్యూఢిల్లీలో ఓ షోలో పాల్గొనడానికి ఫ్లైట్ ఎక్కి వచ్చా. న్యూఢిల్లీలో రోజంతా షూటింగ్‌లో పాల్గొన్నా... మళ్లీ ఆ తర్వాతి రోజు ఫ్లైట్ పట్టుకుని, వారణాసికి వెళ్లాలి. ఆ సమయంలో నన్ను కలవడానికి అతను (మిస్టర్ ఆర్‌పీ) వచ్చాడు. నేను ఉంటున్న హోటల్‌కి వచ్చి లాబీలో వెయిట్ చేశాడు. నాకు ఆ విషయం తెలీదు. నేను 10 నిమిషాల ముందే షూటింగ్‌ నుంచి వచ్చి బాగా అలిసిపోయి పడుకున్నా...

అతను వచ్చిన విషయం కానీ, నా కోసం వెయిట్ చేస్తున్న విషయం కానీ నాకు తెలీదు.అప్పుడు నాకు ఫోన్ వచ్చింది కానీ ఆ రింగ్ కూడా నాకు వినిపించలేదు. అంతలా అలిసిపోయి మత్తుగా పడుకున్నా. లేచి చూసేసరికి 17 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను చాలా ఫీల్ అయ్యా.. నా కోసం అతను అంతలా వెయిట్ చేయాల్సి వచ్చిందని బాధపడ్డాను. వెంటనే ఫోన్ చేసి, ముంబై వచ్చాక కలుస్తానని చెప్పాను...

చెప్పినట్టే ముంబైకి వచ్చినప్పుడు కలిశాను. అయితే ఆ తర్వాతే ఏం జరిగిందో తెలీదు కానీ అది అక్కడితో తెగిపోయింది. దానిపై మీడియా రకరకాలుగా రాసుకొచ్చింది. మీడియా వార్తల వల్ల కూడా మా మధ్య బంధం పెరగకుండానే చెడిపోయింది...’ అంటూ కామెంట్ చేసింది ఊర్వశి. 

ఆమె ఇంటర్వ్యూ తర్వాత  రిషభ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ వేదికగా.. ‘కొందరు పాపులారిటీ కోసం ఇంటర్వ్యూల్లో ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతారో అర్థం కాదు. కేవలం వార్తల్లో నిలిచేందుకు ఇలా చేస్తారంటే ఫన్నీగా ఉంది. పేరు కోసం, ఫేమ్ కోసం ఇంతగా పాకులాడేవారిని వారిని చూస్తుంటే బాధగా ఉంటుంది... వాళ్లకి దేవుడి ఆశీస్సులు ఉండాలి... ’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్టు చేశాడు. 

ఇక తాజాగా  ఊర్వశి.. ‘చోటు భయ్యా బ్యాట్ బాల్ ఆడాలి. నేనేం నిన్ను బద్నాం చేయలేదు. రక్షా బంధన్ శుభాకాంక్షలు ఆర్‌పీ చోటు భయ్యా. అమ్మాయి మౌనంగా ఉందని అడ్వాంటేజ్ తీసుకోకు..’ అని పోస్ట్ పెట్టింది. ఇంటర్వ్యూ మాదిరిగానే ఇక్కడ కూడా రిషభ్ పేరు ఎత్తకుండానే  ఆర్‌పీ అని సంబోధిస్తూ  పంత్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.  

మరి వీళ్లిద్దరి మధ్య ఈ సోషల్ మీడియా వార్ ఎంతకాలం కొనసాగుతుందనేది ఇంకా తేలాల్సి ఉంది.  ఊర్వశికి పంత్ కౌంటర్ ఇస్తాడా..? ఇవ్వడా..? అని ఈ ఇద్దరిని ఫాలో అయ్యేవారు గుసగుసలాడుకుంటున్నారు. మరి పంత్ ఎలా స్పందిస్తాడో...?

click me!