అంపైర్స్ కాల్ లేదు, ఏం లేదు! వికెట్లను తాకితే అవుట్ ఇవ్వాల్సిందే... - విరాట్ కోహ్లీ..

First Published Mar 23, 2021, 1:43 PM IST

అంపైర్స్ కాల్... ఆస్ట్రేలియా టూర్‌ నుంచి ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది టీమిండియా. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు, టీ20 సిరీస్‌లోనూ అంపైర్స్ కాల్స్ నిర్ణయాలు, ప్లేయర్లను తికమకకు గురి చేశాయి... 

అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టులో అయితే బంతి క్లియర్‌గా వికెట్లను తాకుతున్నట్టు కనిపించినా, అంపైర్స్ కాల్స్ అంటూ జో రూట్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్. దీనిపై భారత సారథి విరాట్ కోహ్లీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు కూడా...
undefined
‘డిసిషన్ రివ్యూ సిస్టమ్‌ అందుబాటులోకి రానప్పుడు కూడా నేను చాలా క్రికెట్ ఆడాను. అంపైర్ ఓ నిర్ణయం తీసుకుంటే, అది బ్యాట్స్‌మెన్‌కి నచ్చినా, నచ్చకపోయినా దాన్ని ఆమోదించాల్సిందే...
undefined
డీఆర్‌ఎస్ వచ్చాక అంపైర్ ఇచ్చే కొన్ని తప్పుడు నిర్ణయాలను సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. అయితే అంపైర్ నాటౌట్ ఇచ్చాక, రిప్లైలో బంతి వికెట్లను తాకుతున్నట్టు కనిపిస్తే అవుట్ ఇవ్వాలి...
undefined
అంతేకాని అంపైర్స్ కాల్ అంటూ వికెట్లను తాకుతున్నా నాటౌట్‌గా ప్రకటిస్తే... ఇక డీఆర్‌ఎస్ విధానం తీసుకొచ్చి ఏం ప్రయోజనం’ అంటూ వ్యాఖ్యానించాడు భారత సారథి విరాట్ కోహ్లీ...
undefined
‘అంపైర్స్ కాల్ విధానం వల్ల ప్లేయర్లు చాలా గందరగోళానికి గురవుతున్నారు. బౌలింగ్ వేసేటప్పుడు బంతి వికెట్లను తాకేలా వేయాలని మాత్రమే బౌలర్ ప్రయత్నిస్తాడు. అంతేకాని 50 శాతం కంటే ఎక్కువగా స్టంప్స్‌కి తాకాలంటే అది సరైన పద్ధతి కాదు...
undefined
వికెట్లను బంతి తాకుతున్నప్పుడు అవుట్ అని ప్రకటించడానికి కనీస అవగాహన ఉంటే చాలు, దీని గురించి పెద్ద చర్చ జరగాల్సిన అవసరం కూడా లేదు... బంతి వికెట్లను ఎలా తాకినా, బ్యాట్స్‌మెన్‌ను అవుట్‌గా ప్రకటించాలి.
undefined
ఆ నిర్ణయం బ్యాట్స్‌మెన్‌కి నచ్చినా, నచ్చకపోయినా అతను రివ్యూ తీసుకుని ఉంటే, బ్యాటింగ్ సైడ్ ఓ రివ్యూ అవకాశాన్ని తొలగించాలి... ’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ..
undefined
‘అంపైర్ ఇచ్చే తప్పుడు నిర్ణయాలను ‘స్పిరిట్ ఆఫ్ గేమ్‌’గా పరిగణించాలని చాలామంది మాట్లాడుతుననారు. కానీ అలాంటప్పుడు ఇలాంటి గైడ్‌లైన్స్ రాయడం ఎందుకు... విదేశాల్లో ఇలాంటి నిర్ణయాలు వెలువడితే, వాళ్లు మనలాగే స్పిరిట్ ఆఫ్ గేమ్ గురించి మాట్లాడతారా?’ అంటూ ప్రశ్నించాడు విరాట్.
undefined
ఆస్ట్రేలియా టూర‌లో అయితే అంపైర్స్ కాల్స్ నిర్ణయాల కారణంగా భారత జట్టు చాలా నష్టపోయింది. అప్పుడు దీన్ని తొలగించాలని ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కూడా ఐసీసీని కోరాడు..
undefined
అంపైర్స్ కాల్స్ నిర్ణయంతో పాటు సాఫ్ట్ సిగ్నల్ నిర్ణయంపై కూడా క్రికెట్ ప్రపంచంలో చాలా చర్చ జరుగుతోంది. ఈ రెండు రూల్స్‌లో మార్పులు చేసేందుకు ఆలోచనలు చేస్తోంది ఐసీసీ...
undefined
click me!