
అయితే ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్లు అందరూ ముంబై ఇండియన్స్ ప్లేయర్లు కావడంతో సోషల్ మీడియాలో టీమిండియాను విడదీస్తూ కామెంట్లు, పోస్టులు వెల్లువెత్తుతున్నాయి...
అయితే ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్లు అందరూ ముంబై ఇండియన్స్ ప్లేయర్లు కావడంతో సోషల్ మీడియాలో టీమిండియాను విడదీస్తూ కామెంట్లు, పోస్టులు వెల్లువెత్తుతున్నాయి...
రోహిత్ శర్మ 12 పరుగులకే అవుటైనా సూర్యకుమార్ యాదవ్, మొదటి ఇన్నింగ్స్లనే అద్భుత హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది, టీమిండియా మంచి స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు...
రోహిత్ శర్మ 12 పరుగులకే అవుటైనా సూర్యకుమార్ యాదవ్, మొదటి ఇన్నింగ్స్లనే అద్భుత హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది, టీమిండియా మంచి స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు...
సూర్యకుమార్ యాదవ్తో పాటు బ్యాటింగ్ శ్రేయాస్ అయ్యర్ మెరవడంతో తొలి ఇన్నింగ్స్లో మంచి స్కోరు చేసింది టీమిండియా. అయితే బ్యాటింగ్కి అనుకూలిస్తున్న పిచ్పై దీన్ని కాపాడుకోవడం చాలా కష్టమైపోయింది.
సూర్యకుమార్ యాదవ్తో పాటు బ్యాటింగ్ శ్రేయాస్ అయ్యర్ మెరవడంతో తొలి ఇన్నింగ్స్లో మంచి స్కోరు చేసింది టీమిండియా. అయితే బ్యాటింగ్కి అనుకూలిస్తున్న పిచ్పై దీన్ని కాపాడుకోవడం చాలా కష్టమైపోయింది.
అయితే బ్యాటింగ్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన హార్ధిక్ పాండ్యా, బౌలింగ్లో అదరగొట్టాడు. తొలి ఓవర్లో 2 పరుగులే ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు...
అయితే బ్యాటింగ్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన హార్ధిక్ పాండ్యా, బౌలింగ్లో అదరగొట్టాడు. తొలి ఓవర్లో 2 పరుగులే ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు...
కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నంతసేపు ఇంగ్లాండ్ జట్టు ఈజీ విజయాన్ని అందుకోబోతున్నట్టు కనిపించింది. అయితే ఫీల్డింగ్ చేస్తూ విరాట్ గాయపడడంతో చివరి 8 ఓవర్లలకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహారించాడు...
కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నంతసేపు ఇంగ్లాండ్ జట్టు ఈజీ విజయాన్ని అందుకోబోతున్నట్టు కనిపించింది. అయితే ఫీల్డింగ్ చేస్తూ విరాట్ గాయపడడంతో చివరి 8 ఓవర్లలకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహారించాడు...
రోహిత్ శర్మ జట్టును నడిపించడం మొదలెట్టాక అన్యూహ్యంగా కమ్బ్యాక్ ఇచ్చింది టీమిండియా. శార్దూల్ ఠాకూర్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో పాటు భువనేశ్వర్ టైట్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు...
రోహిత్ శర్మ జట్టును నడిపించడం మొదలెట్టాక అన్యూహ్యంగా కమ్బ్యాక్ ఇచ్చింది టీమిండియా. శార్దూల్ ఠాకూర్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో పాటు భువనేశ్వర్ టైట్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు...
యజ్వేంద్ర చాహాల్ స్థానంలో జట్టులోకి వచ్చిన రాహుల్ చాహార్, 4 ఓవర్లలో 35 పరుగులిచ్చినా 2 కీలక వికెట్లు తీశాడు.... వీరిలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చాహార్, హార్ధిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టు ప్లేయర్లే.
యజ్వేంద్ర చాహాల్ స్థానంలో జట్టులోకి వచ్చిన రాహుల్ చాహార్, 4 ఓవర్లలో 35 పరుగులిచ్చినా 2 కీలక వికెట్లు తీశాడు.... వీరిలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చాహార్, హార్ధిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టు ప్లేయర్లే.
దీంతో ఇంగ్లాండ్ను ఓడించింది టీమిండియా కాదు, ముంబై ఇండియన్స్ అంటూ రోహిత్ శర్మ ఫ్యాన్స్, ముంబై ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు...
దీంతో ఇంగ్లాండ్ను ఓడించింది టీమిండియా కాదు, ముంబై ఇండియన్స్ అంటూ రోహిత్ శర్మ ఫ్యాన్స్, ముంబై ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు...
‘టీమిండియా కంటే ముంబై ఇండియన్స్ బెటర్ టీ20 టీమ్’ అని కామెంట్ చేసిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్... నాలుగో టీ20లో భారత జట్టు విజయం తర్వాత కూడా ఇదే విధంగా స్పందించాడు...
‘టీమిండియా కంటే ముంబై ఇండియన్స్ బెటర్ టీ20 టీమ్’ అని కామెంట్ చేసిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్... నాలుగో టీ20లో భారత జట్టు విజయం తర్వాత కూడా ఇదే విధంగా స్పందించాడు...
‘ఊరికే అంటున్నా... సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్, హార్ధిక్ పాండ్యా ముంబై ఇండియన్, రోహిత్ కెప్టెన్సీ ముంబై ఇండియన్... అంతా ముంబై ఇండియన్స్లాగానే ఉందే’ అంటూ కామెంట్ చేశాడు..
‘ఊరికే అంటున్నా... సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్, హార్ధిక్ పాండ్యా ముంబై ఇండియన్, రోహిత్ కెప్టెన్సీ ముంబై ఇండియన్... అంతా ముంబై ఇండియన్స్లాగానే ఉందే’ అంటూ కామెంట్ చేశాడు..
‘మీ జట్టును ఓ జాతీయ జట్టు ఓడించలేదు, ఓ ఫ్రాంఛైజీ టీం ఓడించిందని తెలిసి ఇంగ్లాండ్ జట్టు బాధపడుతూ ఉండొచ్చు. కానీ మనం ప్రత్యర్థిని ట్రోల్ చేయకుండా, మన సొంత జట్టునే ట్రోల్ చేస్తున్నామనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాం...’ అంటూ ట్వీట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్..
‘మీ జట్టును ఓ జాతీయ జట్టు ఓడించలేదు, ఓ ఫ్రాంఛైజీ టీం ఓడించిందని తెలిసి ఇంగ్లాండ్ జట్టు బాధపడుతూ ఉండొచ్చు. కానీ మనం ప్రత్యర్థిని ట్రోల్ చేయకుండా, మన సొంత జట్టునే ట్రోల్ చేస్తున్నామనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాం...’ అంటూ ట్వీట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్..
ఇంతకుముందు టీమిండియా గెలిస్తే, ప్లేయర్లు ఏ రాష్ట్రంవాళ్లు, ఏ ప్రాంతం వాళ్లు అనే తేడా లేకుండా దేశమంతా సంతోషించేది. కాబట్టి ఐపీఎల్ కారణంగా ప్లేయర్లను, జట్టును విడదీసి చూడడం అలవాటైందని... ఇది ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
ఇంతకుముందు టీమిండియా గెలిస్తే, ప్లేయర్లు ఏ రాష్ట్రంవాళ్లు, ఏ ప్రాంతం వాళ్లు అనే తేడా లేకుండా దేశమంతా సంతోషించేది. కాబట్టి ఐపీఎల్ కారణంగా ప్లేయర్లను, జట్టును విడదీసి చూడడం అలవాటైందని... ఇది ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.