విరాట్ కోహ్లీతో టాప్ తమిళ నటి సెల్ఫీ వైరల్ - సినిమాలో నటిస్తున్నారా?

First Published Sep 14, 2024, 2:59 PM IST

Virat Kohli: విరాట్ కోహ్లీకి భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అన్ని రంగాల నుంచి కోహ్లీని అభిమానించే వారు ఉన్నారు. 

క్రికెటర్ విరాట్ కోహ్లీ

1988లో జన్మించిన విరాట్ కోహ్లీ వయస్సు 35 సంవత్సరాలు, 13 సంవత్సరాల వయస్సు నుండి క్రికెట్ ప్రపంచంలో ప్రయాణిస్తున్న అత్యుత్తమ ఆటగాడు. అద్భుతమైన తన కెరీర్ లో కోట్లాది మంది మనసులు గెలుచుకున్నాడు. 

క్రికెటర్ విరాట్

అక్టోబర్ 2002లో విరాట్ కోహ్లీ జూనియర్ క్రికెట్ ప్రయాణం ప్రారంభమైంది. తన అద్భుతమైన ప్రతిభతో చాలా త్వరగానే "అండర్ 19" పోటీల్లో పాల్గొనే అవకాశం అతనికి లభించింది. ఆగస్టు 2008లో శ్రీలంకకు వెళ్లిన భారత జట్టులో కోహ్లీ కూడా చోటు దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీకి ఇదే తొలి విదేశీ వన్డే పర్యటన.

అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. అద్భుతమైన ఆటతో స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు. క్రికెట్ లో సంచలన ఇన్నింగ్స్ లు ఆడి భారత్ కు అనేక విజయాలు అందించాడు. లెజెండరీ ప్లేయర్ల రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. ఇప్పుడు  భారతీయులకు అభిమాన క్రికెటర్‌గా  మారాడు.

Latest Videos


నటి రాధిక

తన 22 ఏళ్ల క్రికెట్ ప్రయాణంలో ప్రస్తుతం ప్రపంచమే మెచ్చుకునే ప్రముఖ భారత క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు.  2017లో ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడు. అయితే, ఇప్పుడు ఓ ప్రముఖ నటితో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె రాధికా శరత్ కుమార్. 

తమిళ చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే గత 45 సంవత్సరాలుగా అగ్రశ్రేణి నటిగా రాణిస్తున్నారు రాధిక శరత్‌కుమార్. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగ నాయగన్ కమల్, కెప్టెన్ విజయకాంత్, తమిళన్ సత్యరాజ్.. ఇలా తమిళ సినీ పరిశ్రమలో జోడీ కట్టని స్టార్ హీరోలు లేరంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, తన మనసులోని మాటను ఎలాంటి సంకోచం లేకుండా, బహిరంగంగా చాలా దైర్యంగా మాట్లాడే కొద్ది మంది నటీమణుల్లో ఆమె కూడా ఒకరు.

విరాట్ కోహ్లీ రాధిక

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6న తన నటనలో రూపొందిన "లిటిల్ జాఫ్నా" అనే ఫ్రెంచ్ చిత్రం కార్యక్రమం కోసం ఆమె విదేశాలకు వెళ్లారు. అదే విమానంలో విరాట్ కోహ్లీ కూడా ప్రయాణించినట్లు సమాచారం. అతనితో ఫోటో దిగిన రాధిక.. "తనకు చాలా ఇష్టమైన క్రీడాకారుడు, భారతీయులందరికీ ఇష్టమైన క్రీడాకారుడు అయిన కోహ్లీతో అద్భుతమైన ఫోటో దిగడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని" చెప్పారు.

ఈ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. దీంతో ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. ఈ ఫోటోలో రాధికా-విరాట్ కోహ్లీ ఇద్దరూ రిలాక్స్‌డ్‌గా, క్యాజువల్‌గా కనిపించారు. బంగ్లాదేశ్‌తో జరగబోయే భారత టెస్ట్ సిరీస్‌కు సిద్ధమయ్యే మార్గంలో ఉన్న కోహ్లి, సాధారణ ఆఫ్-వైట్ టీ-షర్టును ధ‌రించి ఉన్నారు. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్‌లు అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌ట్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 

 

click me!