బాల్ పొట్టలో గట్టిగా తగిలింది... అందుకే రెచ్చిపోయి బ్యాటింగ్ చేశా... రిషబ్ పంత్ కామెంట్...

First Published Dec 14, 2020, 5:56 PM IST

రాక రాక వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఐపీఎల్‌2020 సీజన్‌లో గాయం కారణంగా పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన రిషబ్ పంత్, ఆసీస్ టూర్‌లో వన్డే, టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. టెస్టు టీమ్‌లో కూడా ప్లేస్ ఉంటుందో లేదో అనే డౌట్. అలాంటి టైమ్‌లో రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తనకి వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్నాడు రిషబ్ పంత్.

ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగిన మూడు రోజుల పింక్ బాల్ ప్రాక్టీస్ టెస్టు మ్యాచ్‌లో టీ20 స్టైల్‌లో చెలరేగి, సెంచరీ పూర్తిచేసుకున్నాడు రిషబ్ పంత్...
undefined
73 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ చేసుకున్న రిషబ్ పంత్, రెండో రోజు ఆఖరి ఓవర్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో సెంచరీ చేసుకున్నాడు...
undefined
అయితే ఆఖరి ఓవర్‌లో అంతలా చెలరేగిపోవడానికి కారణం ఆ ఓవర్‌లోని మొదటి బంతి అట. రెండో రోజు 90వ ఓవర్ ఎదుర్కొన్న రిషబ్ పంత్... దాన్ని షాట్‌గా మలచలేకపోయాడు.
undefined
వేగంగా దూసుకొచ్చిన బంతి, రిషబ్ పంత్ పొట్టకి బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిలలాడిన రిషబ్ పంత్, కోపంతో ఊగిపోయాడట...
undefined
‘విల్డర్ మిత్ వేసిన రెండో రోజు ఆఖరి ఓవర్‌లో మొదటి బంతి నాకు పొట్టలో తగిలింది. బంతి తగలగానే నాకు చాలా కోపం వచ్చింది...
undefined
ఆ ఓవర్‌కి ముందే సెంచరీ పూర్తిచేసుకోవాలని డిసైడ్ అయ్యాను... మిగిలింది ఒకే ఓవర్ కాబట్టి సెంచరీ కోసం ప్రయత్నిస్తానని హనుమ విహారికి చెప్పాడు.
undefined
విహారి కూడా నాకు సపోర్ట్ చేశాడు. కానీ మొదటి బంతి తగిలిన తర్వాత కోపంతో మరింతగా చెలరేగిపోయాడు... కచ్ఛితంగా సెంచరీ చేయాలని డిసైడ్ అయ్యాను...
undefined
ఒకవేళ మొదటి బంతి నాకు తగలకపోతే ఇలా ఆడకపోయి ఉండేవాడినేమో... హనుమ విహారితో మంచి భాగస్వామ్యం నెలకొల్పడం ఆనందంగా ఉంది...’ అంటూ తెలిపాడు రిషబ్ పంత్.
undefined
టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, హనుమ విహారి సెంచరీలు చేయడంతో భారత జట్టుకి భారీ ఆధిక్యం దక్కింది...
undefined
అయితే మూడు వికెట్లు త్వరగా కోల్పోయినా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ జాక్ విల్డర్ మిత్, బెన్ మెక్‌డెర్మాట్ అజేయ సెంచరీలతో ఆస్ట్రేలియా ఏ జట్టును ఓటమి నుంచి కాపాడారు...
undefined
click me!