ఐపీఎల్ 2021 సీజన్కి కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా బ్రేక్ పడింది. ఎట్టకేలకు యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో మిగిలిన మ్యాచులు నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ. అయితే మిగిలిన మ్యాచులను ఇక్కడే పెట్టాలనుకున్నా, కేవలం వాతావరణం కారణంగానే అక్కడ పెడుతున్నామని చెప్పాడు బీసీసీఐ సెక్రటరీ జే షా.