డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత జట్టు విజయం కోసం శ్రమిస్తోంది. ఈ టెస్టులో ఇప్పటికైతే ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో ఉన్నా భారత జట్టుకు కూడా పోరాడగలిగితే గెలిచే అవకాశాలుంటాయి. తొలి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు, టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనా అజింక్యా రహానే.. శార్దూల్ ఠాకూర్ తో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత పలువురు భారత మాజీలు వీరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.