కాగా ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో నిన్న (శనివారం) జోరుగా ఆడిన ఆస్ట్రేలియన్లు నేడు చేతులెత్తేశారు. రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలానికి పెవిలియన్ కు క్యూ కట్టారు. అశ్విన్, జడ్డూ ధాటికి ఆసీస్.. చివరి ఏడుగురు బ్యాటర్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేదు. స్టీవ్ స్మిత్, లబూషేన్, రెన్షా, హ్యాండ్స్కోంబ్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, నాథన్ లియాన్, మర్ఫీలు అలా వచ్చి ఇలా వెళ్లారు. జడ్డూ ఏడు వికెట్లతో చెలరేగగా అశ్విన్ కు మూడు వికెట్లు దక్కాయి.