ఇప్పటికే టీమిండియాలో వికెట్ కీపర్ల విషయంలో తీవ్ర పోటీ ఉన్నది. రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్ లతో పాటు సంజూ శాంసన్ కూడా రేసులో ఉన్నాడు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే ఇప్పుడు ఓపెనర్ల విషయంలో కూడా దాదాపు ఇదే సందిగ్ధత నెలకొంది.