13 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న యువ క్రికెట్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని ఈ ఫార్మాట్ను రూపొందించారు. ప్రతి జట్టుకు రెండు ఇన్నింగ్స్, ఒక్కో ఇన్నింగ్స్కి 20 ఓవర్లు.. మొత్తం 80 ఓవర్లు ఉండటం ప్రత్యేకత. టెస్ట్ మ్యాచిలా రెండు ఇన్నింగ్స్ ఉన్నా, వేగవంతమైన టీ20 శైలిలో సాగుతుంది.
భారత్లోనే తొలి ఎడిషన్
ఆర్గనైజర్ గౌరవ్ బహిర్వాణి ప్రకటించిన వివరాల ప్రకారం, మొదటి రెండు ఎడిషన్లు భారత్లోనే జరగనున్నాయి. మొదటి ఎడిషన్ 2026 జనవరిలో ప్రారంభమవుతుంది. తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యటించే లీగ్గా విస్తరించేలా ప్రణాళిక ఉందన్నారు. మాథ్యూ హేడెన్, హర్భజన్ సింగ్, సర్ క్లైవ్ లాయిడ్, ఏబీ డివిలియర్స్ ఈ ఫార్మాట్ను కలిసి ఆవిష్కరించారు.