వాళ్లు మమ్మల్ని మానసికంగా దెబ్బతీసి, గెలిచారు... టీమిండియాపై ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ సంచలన కామెంట్...

First Published May 13, 2021, 12:46 PM IST

ఆస్ట్రేలియాను, ఆస్ట్రేలియాలో 2-1 తేడాతో చిత్తుచేసి, చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది టీమిండియా. అయితే ఈ టెస్టు విజయం భారత జట్టు తమను మానసికంగా దెబ్బతీసి, సాధించిన విజయం అంటూ సంచలన ఆరోపణలు చేశాడు ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్...

‘టీమిండియాతో మ్యాచులు ఆడడం చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. వాళ్లు మన దృష్టి మరల్చి, మానసికంగా దెబ్బతీయడంలో చాలా సిద్ధహస్తులు. అసలు సిరీస్‌లో వాళ్లు ఎక్కడ పైచేయి సాధించారో అర్థం చేసుకునేలోపే, విజయం వారిచేతుల్లోకి వెళ్లిపోయింది...
undefined
దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ గబ్బా టెస్టు... ముందు వాళ్లు గబ్బాలో టెస్టు ఆడేందుకు ఏ మాత్రం ఇష్టపడలేదు. అసలు బ్రిస్బేన్‌కి రావడమే ఇష్టం లేనట్టుగా ప్రవర్తించారు.
undefined
అంటే ఇలా వాళ్లు భయపడుతున్నారని మనం ఓ భ్రమల్లోకి వెళ్లిపోతాం. అప్పుడు మనల్ని మానసికంగా దెబ్బ తీసి పైచేయి సాధిస్తారు’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్...
undefined
ఆడిలైడ్ టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సంపాదించిన టీమిండియా, ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలి, ఘోరమైన పరాజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ మీద స్వదేశానికి పయనమయ్యాడు.
undefined
అజింకా రహానే సారథ్యంలో మిగిలిన మూడు టెస్టులు ఆడిన టీమిండియా... మెల్‌బోర్న్‌లో అద్భుత విజయాన్ని అందుకుని సిరీస్‌ను సమం చేసింది. సిడ్నీలో హనుమ విహారి, అశ్విన్ వీరోచిత పోరాటం వల్ల డ్రా చేసుకుంది...
undefined
ఆ తర్వాత గబ్బాలో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్, విహారి, బుమ్రా, జడేజా వంటి సీనియర్లు లేకపోయినా శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, సిరాజ్ వంటి పెద్దగా అనుభవం లేని బౌలర్లలో బరిలో దిగి చారిత్రక విజయాన్ని అందుకుంది.
undefined
32 ఏళ్లుగా గబ్బాలో జరిగిన టెస్టుల్లో ఒక్కసారి కూడా పరాజయం రుచిచూడని ఆస్ట్రేలియాని... ‘అబ్బా...’ అనిపించే రేంజ్‌లో దెబ్బతీశాడు రిషబ్ పంత్. రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగులతో చెలరేగి, చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
undefined
టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గా కూడా ఫెయిల్ అయిన టిమ్ పైన్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ వినిపిస్తోంది.
undefined
దీంతో తన తర్వాత మళ్లీ స్టీవ్ స్మిత్‌కే ఆస్ట్రేలియా టెస్టు టీమ్ కెప్టెన్సీ దక్కితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు టిమ్ పైన్... స్టీవ్ స్మిత్, ‘సాండ్ పేపర్’ వివాదం కారణంగా కెప్టెన్సీ కోల్పోయిన విషయం తెలిసిందే.
undefined
టీమిండియా కుర్రాళ్లు ఇచ్చిన షాక్‌తో తేలుకోలేకపోయిన టిమ్ పైన్, తన వైఫల్యాన్ని ఒప్పుకోలేక, భారత జట్టు ఆడిన విధానాన్ని ప్రశంసించలేక... తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నాడని అంటున్నారు నెటిజన్లు...
undefined
click me!