ఫైనల్ ఎఫెక్ట్, రవీంద్ర జడేజాపై వేటు... ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి ఆ ఇద్దరికీ ఛాన్స్...

First Published Jun 25, 2021, 10:17 AM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి, రవీంద్ర జడేజాపై వేటు పడేలా చేసినట్టు టాక్. జడ్డూ పర్ఫామెన్స్‌పై అటు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇటు టీమ్ మేనేజ్‌మెంట్ ఏ మాత్రం సంతోషంగా లేనట్టు సమాచారం.

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ షోతో చెలరేగిపోయాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్‌లతో మెరుపులు మెరిపించాడు...
undefined
కేవలం జడ్డూ వర్సెస్ ఆర్‌సీబీలా మధ్య జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా పర్ఫామెన్స్‌పై విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. తన జట్టు ఓడినా, జడ్డూ ఇలాంటి ఫామ్‌లో ఉండడం టీమిండియాకి కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు...
undefined
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు అవసరమా? అనే ప్రశ్న ఎదురైనా, స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ హనుమ విహారిని పక్కనబెట్టి జడేజాని ఫైనల్‌లో ఆడేంచేందుకు మొగ్గు చూపాడు విరాట్ కోహ్లీ...
undefined
అయితే ఫైనల్‌లో జడేజా నుంచి టీమిండియా ఏం ఆశించిందో, ఆ పర్ఫామెన్స్ అయితే రాలేదు. మెరుపులు మెరిపిస్తాడని భావించిన జడ్డూ, తొలి ఇన్నింగ్స్‌లో 53 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేశాడు.
undefined
రెండో ఇన్నింగ్స్‌లోనూ 49 బంతులు ఆడి 2 ఫోర్లతో 16 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో టిమ్ సౌథీ, కేల్ జెమ్మిసన్‌ల మాదిరిగా మెరుపులు మెరిపిస్తాడని భావించిన జడ్డూ, ఫైనల్ ప్రెజర్‌తో జిడ్డు బ్యాటింగ్ చేశాడు.
undefined
జడేజా కంటే తొలి ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. అశ్విన్ 27 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జడేజా నుంచి కోరుకున్నది ఇలాంటి ఇన్నింగ్స్‌యే.
undefined
ఫైనల్‌లో జడేజా పర్ఫామెన్స్‌తో ఫీలైన విరాట్ కోమ్లీ... ‘మా జట్టుకి ఇప్పుడు సరైన మైండ్ సెట్ ఉన్న సరైన ప్లేయర్లు కావాలి. ఇలా కీలక మ్యాచుల్లో ఫెయిల్ అయ్యే ప్లేయర్లు, టీమిండియా అవసరం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు.
undefined
దీంతో క్లిష్ట సమయాల్లో బ్యాటుతో అద్భుతంగా రాణించగలడని నిరూపించుకున్న వాషింగ్టన్ సుందర్‌ను ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో బరిలో దింపాలని ఆలోచిస్తోందట టీమ్ మేనేజ్‌మెంట్...
undefined
సుందర్‌తో పాటు పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను కూడా ఆడించి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే పరిష్కారాలు కనుక్కోవాలని భావిస్తోందట.
undefined
మహ్మద్ సిరాజ్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్‌... ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది.
undefined
click me!