అసలే టీ20 ప్రపంచకప్ ముందుంది.. జట్టుకు ముందుండి నడపాల్సిన బాధ్యత వాళ్లిద్దరి మీదా ఉంది. ఇద్దరూ అనుభవంలో, ఆటలో ఆరితేరినవారే. కానీ అదే తొందర. కాస్త నిలబడితే పరుగులు వచ్చే పిచ్ ల మీద కూడా ఆతృత బ్యాటింగ్ తో వికెట్లు ఇచ్చుకున్నారు టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు.