సత్తా చాటిన మనీశ్ పాండే... శిఖర్ ధావన్ టీమ్‌పై భువీ టీమ్ విజయం...

First Published Jul 6, 2021, 10:14 AM IST

శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్‌గా ఓ ఇంట్రా స్క్వార్డ్ మ్యాచ్ ఆడింది టీమిండియా. శిఖర్ ధావన్ టీమ్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ టీమ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ‘గబ్బర్’ జట్టు, భువీ జట్టు చేతిలో ఓడిపోవడం విశేషం...

టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ ఇంట్రా స్క్వార్డ్ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ టీమ్ తరుపున ఆడిన మనీశ్ పాండే 45 బంతుల్లో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు...
undefined
రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్‌గా వచ్చి 30+ పరుగులు చేయగా గబ్బర్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.
undefined
భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. శిఖర్ ధావన్ చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...
undefined
లక్ష్యచేధనలో భువీ ఎలెవన్ టీమ్ ఓపెనర్లు పృథ్వీషా, దేవ్‌దత్ పడిక్కల్ తొలి వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం అందించారు...
undefined
ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో మెరవడంతో 154 పరుగుల లక్ష్యాన్ని 17 ఓవర్లలోనే చేధించింది భువనేశ్వర్ కుమార్ జట్టు...
undefined
ఐపీఎల్‌లో మనీశ్ పాండే హాఫ్ సెంచరీ చేసిన ప్రతీసారీ (మెజారిటీ మ్యాచుల్లో) సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడినట్టే, ఇంట్రా స్క్వార్డ్ మ్యాచ్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యిందని అంటున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్...
undefined
click me!