విరాట్ లేడు, షమీ ఆడలేడు... రెండు రోజుల ఆధిపత్యం మనదే... టీమిండియాకి ఇది చాలు...
First Published Dec 24, 2020, 4:10 PM ISTతొలి టెస్టులో ఘోర పరాజయం చెందినా... మొదటి రెండు రోజులు టీమిండియాదే ఆధిపత్యం అనే విషయాన్ని గుర్తుంచుకొని, భారత జట్టు రెండో టెస్టులో బరిలో దిగాలని సూచించాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. గాయం కారణంగా మహ్మద్ షమీ మిగిలిన టెస్టు సిరీస్కి అందుబాటులో ఉండడం లేదని, విరాట్ కోహ్లీ కూడా లేడనే విషయాన్ని భారత జట్టు గుర్తుంచుకుంటే మంచి ఫలితాలు కచ్ఛితంగా సాధించవచ్చని చెప్పాడు గంభీర్.