ఇన్నాళ్లు భారత జట్టుకి బలంగా మారిన మిడిల్ ఆర్డర్, ఈ టూర్లో భారంగా మారింది... విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా (తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో చేసిన 12 పరుగులు తీసి వేస్తే), అజింకా రహానే కంటే... లోయర్ ఆర్డర్లో వచ్చే మహ్మద్ షమీ ఎక్కువ పరుగులు చేశాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు...