రహానేకి కోహ్లీ గురించి తెలుసు... విరాట్ లేకున్నా టీమిండియాను గెలిపించగలడని తెలుసు...
First Published Dec 14, 2020, 6:16 PM ISTఅజింకా రహానే... ఒకప్పుడు భారత జట్టుకి భావి రాహుల్ ద్రావిడ్ అవుతాడని భావించిన క్రికెటర్. అయితే టీ20, వన్డే ఫార్మాట్లో రహానేకి జట్టులో ప్రాధాన్యం తగ్గింది. వేగంగా పరుగులు చేయలేకపోవడంతో జట్టులో చోటు కూడా కోల్పోయాడు అజింకా రహానే. అయితే టెస్టుల్లో మాత్రం వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ గైర్హజరీతో ఆస్ట్రేలియాలో మూడు టెస్టులకి సారథ్యం వహించబోతున్నాడు రహానే...