గత ఏడాది సెప్టెంబర్లో మంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఐదో టెస్టు, అప్పుడు టీమిండియా బృందంలో కరోనా కేసుల కారణంగా అర్ధాంతరంగా రద్దు అయ్యి, ఆ తర్వాత వాయిదా పడినట్టు ప్రకటించబడింది. అప్పటికే భారత జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉండడంతో టీమిండియాకే సిరీస్ ఇవ్వాలని బీసీసీఐ, లేదు ఐదో టెస్టు ఆడకుండా పోయినందుకు అది మేమే గెలిచినట్టు ప్రకటించాలని ఈసీబీ వాదించాయి...