IPL2022: ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్.. కీలక ఆటగాడికి గాయం.. సీజన్ కు డౌటే..?

Published : Mar 28, 2022, 02:43 PM IST

TATA IPL 2022: ముంబై ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచులో సూపర్ విక్టరీని ఎంజాయ్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన కీలక ఆల్ రౌండర్  మిచెల్ మార్ష్ కు గాయమైంది.

PREV
16
IPL2022: ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్.. కీలక ఆటగాడికి గాయం.. సీజన్ కు డౌటే..?

ఐపీఎల్ లో ఆదివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో భారీ లక్ష్యాన్ని  ఛేదించి సూపర్ విక్టరీ కొట్టిన  ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన కీలక ఆటగాడు మిచెల్ మార్ష్.. ఈ సీజన్ లో ఆడటం అనుమానంగానే కనిపిస్తున్నది. 

26

ఆస్ట్రేలియాకు చెందిన మార్ష్.. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ ఆడబోతున్న జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. అయితే ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా  అతడికి గాయమైనట్టు సమాచారం.

36

తొడ కండరాలు పట్టేయడంతో అతడు పాకిస్థాన్ తో మార్చి 29న లాహోర్ వేదికగా జరుగబోయే తొలి వన్డేతో పాటు సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండటం అనుమానమే. ఈ విషయాన్ని స్వయంగా ఆసీస్  పరిమిత ఓవర్ల  సారథి ఆరోన్ ఫించ్ వెల్లడించాడు. 

46

‘మిచ్ మార్ష్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు.  అతడు పాక్ తో వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండటం కష్టమే.. నిన్న ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా అతడు తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు..’ అని ఫించ్ తెలిపాడు. 

56

కాగా.. ఈ ఆల్ రౌండర్ ను ఇటీవలే ముగిసిన వేలం ప్రక్రియలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. రూ. 6.5 కోట్లు వెచ్చించి దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం  పాకిస్థాన్ తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత మార్ష్ తో పాటు ఐపీఎల్ లో ఆడబోయే ఆసీస్ ఆటగాళ్లంతా భారత్ లో జరుగుతున్న తమ తమ జట్లతో కలుస్తారు. 

66

అయితే మార్ష్  గాయం పెద్దదైతే మాత్రం అతడు  ఐపీఎల్ లో ఆడతాడా..? లేదా..? అనేదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.  ఇప్పటికే ఢిల్లీ జట్టు కీలక  బౌలర్ ఆన్రిచ్ నోర్త్జ్ సేవలను కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిక ఆల్ రౌండర్ మార్ష్ సేవలు కూడా ఆ జట్టుకు అందుతాయా..? అంటే  సమాధానం కోసం మరికొద్దిరోజులు ఆగాల్సిందే. 

click me!

Recommended Stories