అయితే ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఇప్పుడే వచ్చినవి కాదని, రెండేండ్లుగా బీసీసీఐ డ్రెస్సింగ్ రూమ్ లో ముంబయి వర్సెస్ ఢిల్లీ గా మారిందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కెప్టెన్సీ నుంచి దిగిపోవద్దని స్వయంగా గంగూలీ చెప్పినా కోహ్లీ మాట వినిపించుకోలేదని, దీంతో రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పజెప్పిన బీసీసీఐ.. ఇటీవలే వన్డే కెప్టెన్సీ కూడా అప్పగించింది. అప్పట్నుంచి వీళ్లిద్దరి మధ్య అభిప్రాయ భేదాలకు సంబంధించిన ఒక్కో వార్త బయటకు వస్తున్నది.