లక్కీగా సెమీ ఫైనల్ చేరిన పాకిస్తాన్, న్యూజిలాండ్ని ఓడించి ఫైనల్ చేరడంతో ఇండియా, పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుందని ఫిక్స్ అయ్యారు. దాయాదుల మధ్య ఫైనల్ ఫైట్ ఓ రేంజ్ సాగుతుందని, భారత జట్టు గత ఏడాది ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటుందని ఎన్నో, ఎన్నెన్నో అంచనాలు... పెరిగిపోయాయి.