రోహిత్ శర్మ: కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. పాక్తో మ్యాచ్లో 4, సౌతాఫ్రికాపై 15, బంగ్లాదేశ్పై 2, జింబాబ్వేపై 15 పరుగులు చేసిన రోహిత్ శర్మ, నెదర్లాండ్స్పై 53 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే సెమీ పైనల్లో 28 బంతులు ఆడిన రోహిత్, 27 పరుగులు చేసి కీలక సమయంలో అవుట్ అయ్యాడు. పవర్ ప్లేలో రోహిత్ శర్మ జిడ్డు బ్యాటింగ్ టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపించింది.