అయితే రోహిత్ శర్మ 109 బంతుల్లో 15 ఫోర్లతో 102 పరుగులు, విరాట్ కోహ్లీ 76 బంతుల్లో 7 ఫోర్లతో 66 పరుగులు చేసి రెండో వికెట్కి 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రిషబ్ పంత్ 32, హార్ధిక్ పాండ్యా 45 పరుగులు, మహేంద్ర సింగ్ ధోనీ 42 పరుగులు చేసినా చేయాల్సిన రన్రేట్ పెరిగిపోవడంతో టీమిండియాకి ఓటమి తప్పలేదు...