ఇదే అదునుగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, టీమిండియాని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్, టీమిండియా బౌలింగ్ యూనిట్ని చేతకాని బౌలర్లుగా తేల్చేశాడు. టీమిండియా గురించి, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ యూట్యూబ్ వ్యూస్ రాబట్టుకునే అక్తర్, ఈసారి భారత బౌలింగ్ యూనిట్ని, పాక్ బౌలింగ్ యూనిట్ని పోల్చి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...