టీమిండియాతో జరిగిన మ్యాచ్లో షాదబ్ ఖాన్ 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసి మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ఓడిన తర్వాత ఏడుస్తూ ఓవరాక్షన్ చేసిన షాదబ్ ఖాన్, లక్కీగా ఫైనల్ చేరడంతో ఇలా ప్రగల్భాలు పలుకుతున్నాడని అంటున్నారు నెటిజన్లు..