ముగ్గురు ప్లేయర్లు, రూ.3.8 కోట్లు... మరింత బలంగా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

Published : Feb 19, 2021, 09:59 AM IST

ఐపీఎల్ వేలం 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ భిన్నమైన వ్యూహంతో బరిలో దిగింది. వేలానికి పెద్దగా క్రికెటర్లను వదిలిపెట్టని సన్‌రైజర్స్ హైదరాబాద్, 22 ప్లేయర్లను అంటిపెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో వేలంలో సన్‌రైజర్స్‌కి పెద్దగా కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా లేకపోయింది.

PREV
18
ముగ్గురు ప్లేయర్లు, రూ.3.8 కోట్లు... మరింత బలంగా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

ఐపీఎల్ 2021 మినీ వేలంలో కేవలం ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ ముగ్గురు ప్లేయర్ల కోసం ఖర్చు చేసిన మొత్తం రూ.3 కోట్ల 80 లక్షలు మాత్రమే...

ఐపీఎల్ 2021 మినీ వేలంలో కేవలం ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ ముగ్గురు ప్లేయర్ల కోసం ఖర్చు చేసిన మొత్తం రూ.3 కోట్ల 80 లక్షలు మాత్రమే...

28

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలం స్పిన్ బౌలింగ్. ఈ వేలంలో మరో ఇద్దరు స్పిన్నర్లను కొనుగోలు చేసింది ఎస్‌ఆర్‌హెచ్. భారత యంగ్ స్పిన్నర్ జె సుచిత్‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలం స్పిన్ బౌలింగ్. ఈ వేలంలో మరో ఇద్దరు స్పిన్నర్లను కొనుగోలు చేసింది ఎస్‌ఆర్‌హెచ్. భారత యంగ్ స్పిన్నర్ జె సుచిత్‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 

38

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇతనితో పాటు మరో ఆఫ్థాన్ ఆల్‌రౌండర్ ముజీబ్ వుర్ రెహ్మాన్‌ను బేస్ ప్రైజ్ రూ. కోటిన్నర వద్ద కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్..

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇతనితో పాటు మరో ఆఫ్థాన్ ఆల్‌రౌండర్ ముజీబ్ వుర్ రెహ్మాన్‌ను బేస్ ప్రైజ్ రూ. కోటిన్నర వద్ద కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్..

48

ముజీబ్ వుర్ రహీమ్‌తో పాటు సుజిత్ కూడా గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో భాగంగా ఉన్నవారు కావడం విశేషం. గత వేలంలో ముజీబ్‌ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్, అతన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది.

ముజీబ్ వుర్ రహీమ్‌తో పాటు సుజిత్ కూడా గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో భాగంగా ఉన్నవారు కావడం విశేషం. గత వేలంలో ముజీబ్‌ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్, అతన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది.

58

వీరితో పాటు గత ఏడాది ఘోరంగా ఫెయిల్ అయిన భారత ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌ను రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌కి దక్కించుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. జాదవ్‌ను స్పిన్నర్‌గా, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా వినియోగించుకోవాలని చూస్తోంది ఎస్‌ఆర్‌హెచ్.

వీరితో పాటు గత ఏడాది ఘోరంగా ఫెయిల్ అయిన భారత ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌ను రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌కి దక్కించుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. జాదవ్‌ను స్పిన్నర్‌గా, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా వినియోగించుకోవాలని చూస్తోంది ఎస్‌ఆర్‌హెచ్.

68

కొందరు ప్లేయర్ల కోసం ఆరెంజ్ ఆర్మీ మొదట్లో ఆసక్తి చూపించినా, ప్లేయర్ ధర రూ.4 - 5 కోట్లు దాటిన తర్వాత పోటీ నుంచి తప్పుకుంది. వేలంలో కొనుగోలు చేసిన ముగ్గురితో కలిసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బలం 25 ఆటగాళ్లకి చేరింది.

కొందరు ప్లేయర్ల కోసం ఆరెంజ్ ఆర్మీ మొదట్లో ఆసక్తి చూపించినా, ప్లేయర్ ధర రూ.4 - 5 కోట్లు దాటిన తర్వాత పోటీ నుంచి తప్పుకుంది. వేలంలో కొనుగోలు చేసిన ముగ్గురితో కలిసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బలం 25 ఆటగాళ్లకి చేరింది.

78

అంతేకాకుండా ఇప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్సులో ఇంకా రూ.6.95 కోట్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ పర్సులో మాత్రమే ఎక్కువ మొత్తం ఉంది. అయితే ఆ జట్లు ప్లేయర్ల కోసం ఖర్చు చేసిన మొత్తం కూడా ఎక్కువే.

అంతేకాకుండా ఇప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్సులో ఇంకా రూ.6.95 కోట్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ పర్సులో మాత్రమే ఎక్కువ మొత్తం ఉంది. అయితే ఆ జట్లు ప్లేయర్ల కోసం ఖర్చు చేసిన మొత్తం కూడా ఎక్కువే.

88

మనవాళ్లు ఛాయ్, బిస్కెట్, స్నాక్స్ తింటూ మిగిలిన జట్ల వేలాన్ని చూస్తూ టైమ్ పాస్ చేయడానికి ఐపీఎల్ వేలానికి వెళ్లినట్టు ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. 

మనవాళ్లు ఛాయ్, బిస్కెట్, స్నాక్స్ తింటూ మిగిలిన జట్ల వేలాన్ని చూస్తూ టైమ్ పాస్ చేయడానికి ఐపీఎల్ వేలానికి వెళ్లినట్టు ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. 

click me!

Recommended Stories