IPL Auction 2021: రూ.15 కోట్లు కొల్లగొట్టిన కేల్ జెమ్మిసన్‌... రోహిత్ శర్మ, ధోనీలతో సమానంగా...

First Published Feb 18, 2021, 6:36 PM IST

 రూ.15 కోట్ల భారీ మొత్తానికి జెమ్మిసన్‌ను కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్....

మ్యాక్స్‌వెల్ కోసం రూ.14 కోట్ల 25 లక్షలు ఖర్చు చేసిన ఆర్‌సీబీ...

ఇద్దరు ప్లేయర్ల కోసం రూ.29 కోట్ల 25 లక్షలు ఖర్చు చేసిన విరాట్ కోహ్లీ టీమ్..

న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కేల్ జెమ్మిసన్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీపడ్డాయి. రూ.15 కోట్ల భారీ మొత్తానికి జెమ్మిసన్‌ను కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్.
undefined
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనీల పారితోషికంతో సమానంగా కేల్ జెమ్మిసన్ రూ.15 కోట్లు తీసుకోబోతున్నాడు.
undefined
టామ్ కుర్రాన్‌ కోసం సన్‌రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. రూ. 5 కోట్ల 25 లక్షలకు టామ్ కుర్రాన్‌ను కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.
undefined
ఛతేశ్వర్ పూజారాను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్.
undefined
షాన్ మార్ష్, కోరీ అండర్సన్, రోవన్ పోవెల్, డివోన్ కాన్వే, డారెన్ బ్రావో, రస్సీ వన్ డూసీ, మార్టిన్ గుప్టిల్‌లను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు.
undefined
గురుకీరట్ సింగ్ మాన్, మార్నస్ లబుషేన్‌లను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపలేదు.
undefined
మొయిసిస్ హెండ్రిక్స్‌‌ను కొనుగోలు చేయడానికి ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ పోటీపడ్డాయి. రూ.4 కోట్ల 20 లక్షలకు హెండ్రిక్స్‌ను కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.
undefined
వరుణ్ అరుణ్‌, మోహిత్ శర్మ, ఓసానో థామస్‌, నవీన్ వుల్ హక్, బిల్లీ స్టాంలేక్‌, మిచెల్ మెక్‌నిగన్, జేసన్ బెహ్రన్‌ఓర్ఫ్ కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఇష్టపడలేదు.
undefined
click me!