IPL 2020 సీజన్లో ఆటగాళ్లను గాయాలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. గాయాల కారణంగా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్న జట్టు సన్రైజర్స్ హైదరాబాద్. మొదటి మ్యాచ్లో గాయపడిన మిచెల్ మార్ష్, ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ గాయంతో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. వీరి స్థానంలో జట్టులోకి వచ్చిన విండీస్ ప్లేయర్ జాసన్ హోల్డర్, ఆడిన మొదటి మ్యాచ్లోనే మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.