సీఎస్‌కే ‘సీనియర్ సిటిజన్స్ క్లబ్‌’లా తయారైంది... ధోనీ టీమ్‌పై వీరూ పంచ్...

First Published Oct 23, 2020, 5:13 PM IST

IPL 2020 సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. 10 మ్యాచుల్లో కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే గెలిచి, ఐపీఎల్ చరిత్రలో చెత్త ప్రదర్శన నమోదుచేసింది. అసలే కష్టాల్లో ఉన్న ధోనీ జట్టును సీనియర్ సిటిజన్స్ క్లబ్‌తో పోల్చాడు వీరేంద్ర సెహ్వాగ్.

ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది చెన్నై సూపర్ కింగ్స్. మిగిలిన మ్యాచుల్లో గెలిచి కనీసం పరువు నిలుపుకోవాలని భావిస్తోంది...
undefined
నేడు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలబడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్...
undefined
గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై నాలుగు మ్యాచుల్లో గెలిచి, టైటిల్ కైవసం చేసుకుంది సీఎస్‌కే...
undefined
అయితే ఈ సీజన్ ప్రారంభమ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ను ఓడించి, ఘనంగా సీజన్‌ను ప్రారంభించింది ధోనీ టీమ్...
undefined
మొదటి మ్యాచ్‌లో విజయం తర్వాత ధోనీ జట్టుకి ఏదీ కలిసి రాలేదు. మళ్లీ అలాంటి పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది చెన్నై సూపర్ కింగ్స్...
undefined
వరుసగా విఫలం అవుతున్న సీనియర్లనే నమ్ముకుని, పెద్ద మూల్యం చెల్లించుకుంది ధోనీ జట్టు.
undefined
దీంతో సీఎస్‌కే ఓ సీనియర్ సిటిజన్స్ క్లబ్ అంటూ వ్యాఖ్యానించాడు వీరేంద్ర సెహ్వాగ్...
undefined
కేదార్ జాదవ్, అంబటి రాయుడు, షేన్ వాట్సన్, డుప్లిసిస్, పియూష్ చావ్లా, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు అందరూ 31 ఏళ్ల పైబడినవాళ్లే...
undefined
‘ఐపీఎల్‌లో బిగ్గెస్ట్ ఫైట్ ఇప్పటికే జరిగింది. మొదటి మ్యాచ్‌లోనే చెన్నై, ముంబైని ఓడించింది. అయితే ఆ తర్వాత చెన్నై విన్నింగ్ టీమ్ కంటే ఎక్కువగా సీనియర్స్ సిటిజన్స్ క్లబ్‌గా కనిపించింది’ అని కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...
undefined
కుర్రాళ్లకు పెద్దగా అవకాశాలు ఇవ్వకుండా, తన స్నేహితులను ఆడించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ...
undefined
మరి నేటి మ్యాచ్‌లో అయినా యువకులకు ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి 39 ఏళ్ల సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ...
undefined
click me!