అయితే టీమిండియా రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు గాయం కారణంగా తప్పుకోవడంతో జూన్ లో జరుగబోయే ఈ టోర్నీకి వికెట్ కీపర్ గా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ కూడా జరుగుతోంది. బీజీటీలో పంత్ స్థానంలో వచ్చిన కెఎస్ భరత్, ఇషాన్ కిషన్ లలో ఎవరికి ఆడించాలనేదానిపై ఇప్పటికే క్రికెట్ పండితులు, సీనియర్ క్రికెటర్లు చర్చోపచర్చలు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయమై టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా స్పందించాడు.