2019 లో భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా.. వైజాగ్ లో తొలి టెస్టు ఆడింది. ఈ టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 502 పరుగులు చేసింది. తొల ఇన్నింగ్స్ లో మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ చేయగా.. రోహిత్ శర్మ 176 రన్స్ కొట్టాడు. ఆ ఇన్నింగ్స్ లో విహారి 10 పరుగులే చేశాడు. ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన సౌతాఫ్రికా పై మహ్మద్ షమీ 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ విజయం సాధించింది.