తొలిరోజు న్యూజిలాండ్ను భారత్ 235 పరుగులకు ఆలౌట్ చేసింది. విల్ యంగ్ (71), డారిల్ మిచెల్ (82) అర్ధసెంచరీలు చేశారు. రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్లో 14వ సారి ఐదు వికెట్లు సాధించగా, వాషింగ్టన్ సుందర్ కూడా నాలుగు వికెట్లు పడగొట్టాడు. గిల్ ఔటయ్యే సమయానికి భారత్ 227/8తో మంచి స్పందనను కనబరిచింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 263-10 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత ప్లేయర్లలో జైస్వాల్ 30, గిల్ 90, రిషబ్ పంత్ 60, వాషింగ్టన్ సుందర్ 38 పరుగులు చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మరోసారి నిరాశపరిచారు. న్యూజిలాండ్ తరఫున అజాజ్ పటేట్ 5 వికెట్లు తీసుకున్నాడు. ఇక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో పెద్దగా పరుగులు చేయకుండా భారత బౌలర్లు అడ్డుకున్నారు. ఆట ముగిసే సమయానికి కీవీస్ జ్టు 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ 3, రవీంద్ర జడేజా 4 వికెట్లు తీసుకున్నారు. న్యూజిలాండ్ ప్లేయర్లలో విల్ యంగ్ 51, డేవాన్ కాన్వే 22, గ్లెన్ ఫిలిప్స్ 26 పరుగులు చేశారు. ఇప్పటివరకు కీవీస్ జట్టుకు 143 పరుగుల ఆధిక్యం లభించింది.