సెంచరీ ముంగిట శుబ్మన్ గిల్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా...
First Published Jan 19, 2021, 9:14 AM ISTగబ్బా టెస్టులో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 146 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 పరుగులు చేసిన శుబ్మన్ గిల్, మొట్టమొదటి సెంచరీకి 9 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. నాథన్ లియాన్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు శుబ్మన్ గిల్. దీంతో 114 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.