రూ.450 కోట్ల చిట్ఫండ్ కుంభకోణంలో గుజరాత్ ప్లేయర్లు
ఇటీవల, రూ.450 కోట్ల చిట్ఫండ్ కుంభకోణానికి సంబంధించి ప్రధాన నిందితుడైన భూపేంద్రసింగ్ జాలాను అధికారులు విచారించారు. బ్యాంకులు అందించే దాని కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి రూ.6 వేల కోట్లను సేకరించిన భూపేంద్ర సింగ్ ఝలాను గుజరాత్ సీఐడీ అరెస్ట్ విచారించగా క్రికెటర్ల అంశం బయటకు వచ్చిందని సమాచారం.
ఈ చిట్ఫండ్ లో క్రికెటర్లు శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తివేటియా, మోహిత్ శర్మ పెట్టుబడి పెట్టారు. భూపేంద్రసింగ్ జాలా వాంగ్మూలం ఆధారంగా మోసానికి సంబంధించి క్రికెటర్లపై గుజరాత్ CID పోలీసులు చర్యలు తీసుకోనున్నారని సమాచారం.
ప్రస్తుతం శుభ్ మన్ గిల్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ స్థానంలో ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత భారత క్రికెటర్లు స్వదేశానికి తిరిగి వస్తారు. ఆ తర్వాత శుభ్ మన్ గిల్ తో పాటు నలుగురు క్రికెటర్లకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.