అహ్మదాబాద్ జట్టు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్... డేవిడ్ వార్నర్‌ చూపు ఆ ఫ్రాంఛైజీ వైపు...

First Published Jan 6, 2022, 12:39 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీలు. ఇప్పటికే ఈ రెండు జట్ల హెడ్ కోచ్‌లు, మెంటర్‌లపై ఓ క్లారిటీ రాగా, మెగా వేలానికి ముందే కెప్టెన్లను కూడా ఎంచుకునే పనిలో బిజీగా ఉన్నాయి అహ్మదాబాద్, లక్నో...

Gautam Gambhir

లక్నో ఫ్రాంచైజీ మెంటర్‌గా గౌతమ్ గంభీర్‌, హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్ వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది...

రూ.7090 కోట్ల భారీ ధర చెల్లించి లక్నో జట్టును బిడ్డింగ్‌లో దక్కించుకున్న ఆర్‌పీఎస్‌ గోయింకా గ్రూప్... రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌ అధికారిక సోషల్ మీడియా ఖాతాల పేర్లను లక్నో ఫ్రాంఛైజీగా మార్చేసింది...

లక్కో జట్టు పేరును నిర్ణయించే అవకాశం అభిమానులకే ఇచ్చింది ఫ్రాంఛైజీ. అభిమానులు సూచించే పేర్లలో బెస్ట్ అనుకున్నదాన్ని టైటిల్‌గా ఎంచుకోనుంది లక్నో ఫ్రాంఛైజీ...

మరోవైపు రూ.5625 కోట్ల మొత్తానికి అహ్మదాబాద్ ఫ్రాంఛైజీని దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్ కూడా లక్నోకి తగ్గకుండా జట్టు ఎంపిక విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది...

Ashish Nehra

అహ్మదాబాద్ మెంటర్‌గా 2011 వన్డే వరల్డ్‌ కప్ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్, హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా ఎంపికైనట్టు సమాచారం...

Shreyas Iyer , KL Rahul

అహ్మదాబాద్ బ్యాటింగ్ కోచ్‌గా, క్రికెట్ డైరెక్టర్‌గా విక్రమ్ సోలంకి ఎంపికైనట్టు సమాచారం. అయితే ఇప్పటిదాకా అహ్మదాబాద్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు...

తాజాగా అహ్మదాబాద్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌‌ ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు రెండు సీజన్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించాడు శ్రేయాస్ అయ్యర్..

2019 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆరేళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కి చేరిన ఢిల్లీ క్యాపిటల్స్, 2020 సీజన్‌లో మొట్టమొదటిసారిగా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది...

Shreyas Iyer, Rishabh Pant

అయితే 2021 సీజన్ ఆరంభానికి ముందు శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో అతని స్థానంలో రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ అప్పగించింది టీమ్ మేనేజ్‌మెంట్. పంత్ కెప్టెన్సీ నచ్చడంతో అయ్యర్ కోలుకున్న తర్వాత కూడా కెప్టెన్‌గా అతన్నే కొనసాగించింది...

Shreyas Iyer

కెప్టెన్సీ పోవడంతో తెగ ఫీలైన శ్రేయాస్ అయ్యర్, జట్టును వీడాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకే  ఢిల్లీ క్యాపిటల్స్ 2022 రిటెన్షన్స్‌లోనూ అతనికి చోటు దక్కలేదు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో అహ్మదాబాద్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ ఎంపికయ్యాడని, అతన్ని రూ.15 కోట్లు చెల్లించి కొనుగోలు చేసేందుకు సదరు ఫ్రాంఛైజీ ముందుకొచ్చిందని సమాచారం...

లక్నో ఫ్రాంచైజీ కెఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంచుకుందని, అతనితో పాటు రషీద్ ఖాన్, హార్ధిక్ పాండ్యా వంటి ఆల్‌రౌండర్లు కూడా లక్నో జట్టులో చేరబోతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే...

దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఆర్‌సీబీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నాడని టాక్. సన్‌రైజర్స్‌కి 2016లో టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్, 2021 సీజన్‌లో కెప్టెన్సీ కోల్పోయాడు...

టీమ్ మేనేజ్‌మెంట్‌తో విభేదాల కారణంగా తుది జట్టులో ప్లేస్ కూడా కోల్పోయిన డేవిడ్ వార్నర్‌కి 2022 రిటెన్షన్‌లో చోటు దక్కలేదు...

ఆర్‌సీబీ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో ఉన్న అనుబంధం కారణంగా, విరాట్ కోహ్లీ అండ్ కో కూడా డేవిడ్ వార్నర్‌ను టీమ్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం...

click me!