మీరు అందుకు తప్ప ఎందుకు పనికి రావు... సొంత జట్టును తిట్టిపోసిన షోయబ్ అక్తర్...

First Published Jul 11, 2021, 5:19 PM IST

జింబాబ్వే, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌లతో ప్రతాపం చూపిస్తూ... మేం టాప్ టీమ్‌‌లలో ఒకళ్లం అంటూ గొప్పలు చెప్పుకునే పాక్ క్రికెట్ జట్టు, ఇంగ్లాండ్ టూర్‌లో ముప్పుతిప్పలు పడుతోంది. వరుసగా రెండు వన్డేల్లో చిత్తుగా ఓడి, ఇప్పటికే సిరీస్ కోల్పోయింది...

మొదటి వన్డేలో 141 పరుగులకే ఆలౌట్ అయ్యి, ఇంగ్లాండ్ టీమ్ చేతుల్లో 9 వికెట్ల తేడాతో ఓడిన పాకిస్తాన్ జట్టు, రెండో వన్డేలో 52 పరుగుల తేడాతో ఓడింది...
undefined
సాధారణంగా అయితే ఇంగ్లాండ్ టూర్‌లో పాక్ జట్టు ఓడినా ఇన్ని విమర్శలు వచ్చేవి కావు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఆడుతోంది ఇంగ్లాండ్ ప్రధాన జట్టుతో కాదు, వారి మూడో జట్టుతో...
undefined
వన్డే సిరీస్‌ కోసం ఎంపికైన ప్లేయర్ల బృందంతో పాజిటివ్ కేసులు నమోదుకావడంతో ఒక్క రోజు ముందు కొత్త జట్టును ఎంపిక చేసి, ఏ మాత్రం ప్రాక్టీస్ లేకుండా బరిలో దిగింది ఇంగ్లాండ్ జట్టు. కౌంటీ ప్లేయర్ల జట్టును కూడా ఓడించలేక, చిత్తుగా ఓడుతోంది పాక్ టీమ్...
undefined
‘పాక్ జట్టు ఆటతీరు చూస్తుంటే, ఇంకా శ్రీలంక జట్టు ఆడుతున్నట్టే ఉంది. వాళ్లే నయం, ఇంగ్లాండ్ మెయిన్ టీమ్‌తో ఆడి, ఓడారు. మీరు బీ టీమ్‌ను కూడా ఓడించలేకపోతున్నారు...
undefined
పాకిస్తాన్ జట్టు ఇలాగే ఆడడం కొనసాగిస్తే, ఈ మ్యాచులను ఇంక ఎవరూ చూడరు. పాకిస్తాన్ జట్టులోని ప్లేయర్లను కూడా ఫాలో అవ్వడం ఆపేస్తారు. ఎందుకంటే అందులో స్టార్లు లేరు కదా...
undefined
ఇలాంటి మ్యాచులు చూసేందుకు టికెట్ కొని, స్టేడియానికి వెళ్లడం కూడా వేస్ట్... నిజం చెప్పాలంటే, పాకిస్తాన్ జట్టు ఓ యావరేజ్ టీమ్. వాళ్ల బ్యాటింగ్ కూడా యావరేజ్, అందులో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు...
undefined
పాకిస్తాన్ జట్టు ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయింది. ఇలాగే ఆడితే క్లీన్ స్వీప్ కూడా అవుతుంది. అలాగని లక్ష్యం మరీ కష్టమైనదా అంటే బంతికో పరుగు చేసినా ఈజీగా గెలిచేయొచ్చు...
undefined
బంతి కొద్దిగా తిరిగితే చాలు, ఆడలేకపోతున్నారు. ఇది చాలా చాలా యావరేజ్ పర్ఫామెన్స్... పాకిస్తాన్ జట్టును ఎవరైనా విమర్శిస్తే నాకు కూడా నచ్చదు...
undefined
కానీ చెప్పండి, ఇలా ఆట చూస్తే ఏ పిల్లాడైనా క్రికెట్ ఆడాలని అనుకుంటాడా? పాక్ క్రికెట్ బోర్డు ఆలోచన ఇదే ఉన్నట్టుంది. ఎవ్వరూ క్రికెట్ చూడకుంటే, క్రికెట్ ఫాలో అవ్వకుండా... డబ్బులను ఇష్టం వాడుకోవచ్చు...
undefined
పాకిస్తాన్ జట్టు కేవలం టీ20లు ఆడడానికి మాత్రమే పనికొస్తుంది. వాళ్లు వన్డేలను కూడా టీ20ల్లాగే ఆడుతున్నారు. 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయారు. టీ20ల్లోనూ అంతే 150 నుంచి 175 పరుగులు చేస్తారు, వన్డేల్లోనూ అదే చేయగలుగుతున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్..
undefined
click me!