రాహుల్ త్రిపాఠి: ఐపీఎల్లో మాత్రమే కాకుండా దేశవాళీ టోర్నీల్లో నిలకడైన పర్ఫామెన్స్ ఇస్తున్నాడు రాహుల్ త్రిపాఠి. ఐపీఎల్ 2022లో 413 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠిని ఐర్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్ సిరీస్లకు ఎంపిక చేసింది టీమిండియా. అయితే అతనికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండానే టీమ్ నుంచి తప్పించింది బీసీసీఐ. అన్క్యాప్డ్ ప్లేయర్గా ఐపీఎల్లో దాదాపు 1800 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, టాపార్డర్లో, మిడిల్ ఆర్డర్లో భారత జట్టుకి బాగా ఉపయోగపడేవాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్...