విడాకులు తీసుకున్న శిఖర్ ధావన్ దంపతులు

First Published Sep 8, 2021, 7:45 AM IST

శిఖర్ ధావన్ తో వివాహం జరిగాక 2014లో వారికి ఒక బాబు( జొరావర్) పుట్టాడు. దాదాపు 9 ఏళ్ల అనంతరం శిఖర్ జంట తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికింది.

Shikhar Dhawan-Ayesha Mukherjee

టీమిండియా స్టర్ క్రికెటర్ శిఖర్ ధావన్.. తన భార్య ఆయేషా ముఖర్జీతో విడాకులు తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ధావన్ భార్య ఆయేషా ముఖర్జీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా స్పష్టం చేసింది. రెండోసారి విడాకులు తీసుకునే వరకు విడాకులు అనే పదం తనకు చెత్త పదంగా అనిపించేందని ఆయేషా పేర్కొనడం గమనార్హం.

విడాకుల విషయంపై శిఖర్ ధావన్ ఇంత వరకు స్పందించలేదు. మెల్ బోర్న్ బాక్సర్ అయిన ఆయేషా ముఖర్జీతో ధావన్ ప్రేమలో పడ్డాడు. దీంతో 2012 లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆయేషాకి ముఖర్జీకి గతంలోనే పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

శిఖర్ ధావన్ తో వివాహం జరిగాక 2014లో వారికి ఒక బాబు( జొరావర్) పుట్టాడు. దాదాపు 9 ఏళ్ల అనంతరం శిఖర్ జంట తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికింది.
 

ఆయేషా విడాకుల విషయంపై ఇన్ స్టా లో సుదీర్ఘమైన పోస్టు చేశారు. వివాహం, విడాకులు అనే పదాలు చాలా శక్తి వంతమైన అర్థాలు కలిగి ఉంటాయని అన్నారు. 

మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు చాలా భయపడ్డానని, జీవితంలో విఫలమైనట్లు, తప్పు చేస్తున్నట్లుగా భావించానని అన్నారు. తన తల్లిదండ్రులను, పిల్లలను నిరాశకు గురిచేసినట్లు భావించానని ఆమె తెలిపారు.

Shikhar Dhawan Wife

ఇక రెండోసారి విడాకులు తీసుకోవడం అనేది ఊహించుకుంటే భయంకరంగా ఉన్నట్లు తెలిపింది. ఈ సమయంలో తనను తాను మళ్లీ నిరూపించుకోవాలని ఆయేషా తెలిపింది.

ఇక శ్రీలకంతో జరిగిన పరిమిత వన్డే, టీ20 సిరీస్ లకు ధావన్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన గబ్బర్.. త్వరలో జరగనున్న టీ 20 ప్రపంచకప్ జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు. 

టీ20 ప్రపంచకప్ జట్టును బుధవారం ప్రకటించనున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ ఓపెనింగ్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇంకో రెండో ఓపెనర్ కోసం రాహుల్ తో ధావన్ పోటీ పడాల్సి వస్తోంది. 

click me!