షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్... నాలుగో టెస్టుకి ఉమేశ్ యాదవ్... నటరాజన్కి ఛాన్స్?...
First Published Dec 30, 2020, 2:05 PM ISTతొలి టెస్టులో గాయపడి, టెస్టు సిరీస్ మొత్తానికి దూరమైన మహ్మద్ షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్కి జట్టులో చోటు కల్పించింది టీమిండియా. రెండో టెస్టులో గాయపడిన ఉమేశ్ యాదవ్ ఫిట్నెస్పై ఇంకా క్లారిటీ రాలేదు. మూడో టెస్టు ఆడకపోయినా, నాలుగో టెస్టు సమయానికి ఉమేశ్ యాదవ్ ఫిట్నెస్ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తోంది భారత జట్టు. షమీ, ఉమేశ్ యాదవ్ గాయపడడంతో టీ20, వన్డేల్లో రాణించిన నటరాజన్కి టెస్టుల్లో ఛాన్స్ వస్తుందని భావించినా... నట్టూ రాకపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు బీసీసీఐ.