సెంచరీలు చేసి, మీ రికార్డులు పెంచుకోవడానికి తప్ప, ఈ సిరీస్ ఎందుకు పనికి రాదు.. - సునీల్ గవాస్కర్

Published : Jun 27, 2023, 06:04 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడిన టీమిండియా, వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. ఈ పర్యటనలో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 సిరీస్‌లు ఆడబోతోంది భారత జట్టు...

PREV
15
సెంచరీలు చేసి, మీ రికార్డులు పెంచుకోవడానికి తప్ప, ఈ సిరీస్ ఎందుకు పనికి రాదు.. - సునీల్ గవాస్కర్
Rohit Sharma

టెస్టు, వన్డే సిరీస్‌లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ, టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీ20 సిరీస్‌ టీమ్‌ని వెస్టిండీస్‌కి పంపనుంది. ఈ సిరీస్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్..

25

‘వెస్టిండీస్ ఇప్పుడు మునుపటిలా లేదు. గత రెండు దశాబ్దాల్లో వారి పర్ఫామెన్స్ ఏ మాత్రం బాగోలేదు. ప్రస్తుతం వాళ్లు జింబాబ్వేలో వన్డే వరల్డ్ కప్‌కి అర్హత సాధించడానికి క్వాలిఫైయర్స్ ఆడుతున్నారు. ఇంతకుముందు రెండు సార్లు వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌కి ఏ పరిస్థితి పట్టిందో అర్థం చేసుకోవచ్చు..
 

35
Rohit Sharma-Gavaskar

అలాంటి టీమ్‌పై సీనియర్లను సెలక్ట్ చేయడం అర్థం లేని విషయం. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో ఫెయిల్ అయిన సీనియర్లు, వెస్టిండీస్ టూర్‌లో సెంచరీలు చేసి తాము మొనగాళ్లం అని, ఫామ్‌లో ఉన్నామని నిరూపించుకోవడానికే ఈ సిరీస్ పెట్టినట్టు ఉంది..

45
Kohli-Rahane

వెస్టిండీస్‌లో సెంచరీలు చేసినా, వికెట్ల మీద వికెట్లు తీసుకున్నా అవి మీ వ్యక్తిగత గణాంకాలు మెరుగుపర్చుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రావు. వచ్చే ఆరు నెలలు టీమిండియా యమా బిజీగా గడపబోతోంది..

55
Kohli-Rahane

అందుకని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్లకు వెస్టిండీస్ టూర్ నుంచి విశ్రాంతి కలిగించి ఉంటే బాగుండేది. వారి స్థానంలో కుర్రాళ్లకు అవకాశం ఇచ్చి ఉంటే సరిపోయేది... వరల్డ్ కప్‌ మీద ఫోకస్ పెట్టకుండా ఈ సిరీస్‌లు ఎందుకు?’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్.. 

click me!

Recommended Stories