దీపక్ హుడా, రిషబ్ పంత్ వంటి ప్లేయర్లకు వరుస అవకాశాలు ఇస్తున్న టీమిండియా మేనేజ్మెంట్, సంజూ శాంసన్ చేస్తున్న పరుగులను మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది భారత జట్టు తరుపున మూడు టీ20 మ్యాచులు ఆడిన సంజూ శాంసన్, శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 25 బంతుల్లో 39 పరుగులు చేశాడు. మూడో టీ20లో 12 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఐర్లాండ్తో మ్యాచ్లో 43 బంతుల్లో 77 పరుగులు చేసి అదరగొట్టాడు...